హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకారం యొక్క ఉత్సాహభరితమైన వేడుకను నిర్వహించి, లిప్పన్ కళ యొక్క కాలాతీత ఆకర్షణను సమకాలీన వెలుగులోకి తీసుకొచ్చింది. శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక లెన్స్ ద్వారా తిరిగి ఊహించుకుంటూ, సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్ సున్నితత్వాలతో మిళితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది కళాశాలలకు చెందిన 55 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ఒకరికి మరొకరు సహకరించుకోవడంతో పాటు ఇతరులతో పరిచయాలను పెంచుకుని, తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సాంప్రదాయ చేతిపనుల యొక్క సాధారణ అన్వేషణగా ప్రారంభమై, ఆవిష్కరణ, బృంద కృషి, కళాత్మక వ్యక్తీకరణలతో కూడిన కాన్వాస్ గా పరిణామం చెందింది. స్కెచ్ బుక్ లు సంక్లిష్టమైన నమూనాలతో రోజంతా వికసించాయి. నైపుణ్యం కలిగిన చేతుల కింద గాలికి ఎండిపోయిన బంకమట్టి రూపాంతరం చెంది, చేతిపనులను ప్రతిబింబించాయి. వర్ధమాన వాస్తుశిల్పులు శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక మెరుగులద్దారు. నెక్సెస్ లో పాల్గొన్న వారంతా తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, నేటి నిర్మాణ, కళాత్మక వ్యక్తీకరణలలో సాంప్రదాయ మూలాంశాలు తాజా అర్థాన్ని ఎలా పొందవచ్చో అన్వేషించడంతో వాతావరణమంతా శక్తి, ఊహతో సజీవంగా మారింది. తత్ఫలితంగా, భారతదేశ కళాత్మక వారసత్వాన్ని, యువత ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబించే సృజనాత్మక ప్రదర్శనగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షా నోముల (యూనిట్ సెక్రటరీ, మూడో సంవత్సరం), జక్కిడి అద్వయ స్ఫూర్తి (యూనిట్ డిజైనర్, రెండో సంవత్సరం)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రుతి గావ్లి సమన్వయం చేశారు.
లిప్పన్ కళారూపానికి ఆధునికతగీతంలో నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకార వేడుక
RELATED ARTICLES

