గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సత్పడి భానుచందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి మార్గంలో భాగస్వాములుగా మారాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
స్థానికంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు వంటి కీలక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని వెల్లడించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

