Sunday, August 2, 2026

పారిశుద్ధ్య కార్మికులకు మైత్రి ఫౌండేషన్ చేయూత

మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ తండ్రి చెన్నంశెట్టి సత్యనారాయణ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా భోజన విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారి సేవలను గుర్తిస్తూ చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి కృషిని గుర్తించి అభినందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular