గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాగారంలో భాగంగా మండలంలో నేడు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు యువ నాయకులు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం యువతను ఉత్సాహ పరిచే విధముగా మహాశివరాత్రి రోజు ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే జట్లు సాయంత్రం 5 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్లుగా నరేష్, రాజశేఖర్ , రాకేష్, రవి, భీకరం దాస్ ,అంజన్ గౌడ్ , సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ వివరిస్తున్నారని యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్రికెట్ పోటీలు
RELATED ARTICLES

