Sunday, April 5, 2026

మహాశివరాత్రి సందర్భంగా రాత్రి క్రికెట్ పోటీలు

గుమ్మడిదల మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగారంలో భాగంగా రాత్రి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. యువ నాయకుడు కర్ణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇవి 8వ వార్షికోత్సవ క్రికెట్ పోటీలని.. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్ నిర్వహణలో నరేష్, రాజశేఖర్, రాకేష్, రవి, భీకరం దాస్, అంజన్ గౌడ్, సురేశ్, సాయి, హరీష్, ఆశు, జగదీష్, అరవింద్, విజయ్ పాల్గొంటున్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular