రేపు ఉదయం నుంచి నిత్య పూజలు ప్రారంభం…
సలాం హైదరాబాద్ గుమ్మడిదల :- పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి వీరన్నగూడెం వార్డులోనీ ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం నిత్యకర్మలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేసి గ్రహణ కాలమంతా భక్తుల దర్శనాలను నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రేపు తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య పూజలు, సాధారణ దర్శనాలు కొనసాగనున్నాయి.

