Sunday, April 5, 2026

గుమ్మడిదలలో ఉత్సాహంగా హోలీ వేడుకలు

హాజరైన సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి..

సలాం హైదరాబాద్: గుమ్మడిదల పట్టణంలో హోలీ పండుగను యువత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ప్రధాన వీధులు రంగుల కాంతులతో కళకళలాడాయి. యువకులు పరస్పరం రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. పలుచోట్ల సంగీతంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని యువతతో కలిసి రంగులు చల్లారు. పండుగలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, స్నేహభావంతో సంబరాలు జరుపుకోవాలని సూచించారు. రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యనారాయణ, మహిపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంటి మల్లేష్ తదితరులు పాల్గొనారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular