Wednesday, June 3, 2026
Home Blog Page 2

అభివృద్ధి బాటలో ముందుకెళ్లేందుకు అధికార పార్టీకి మద్దతు తెలపండి 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు ప్రచారం

సలాం హైదరాబాద్ ప్రతినిధి:-గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 11వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టా నర్సింగరావు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను నేరుగా కలిశారు.ఈ సందర్భంగా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే అభివృద్ధి పనులకు మరింత వేగం వస్తుందని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డు సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను తెలుసుకుని అభివృద్ధి దిశగా నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి బాటలో ముందుకు సాగాలిఅన్నారం 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సత్పడి భానుచందర్

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సత్పడి భానుచందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి మార్గంలో భాగస్వాములుగా మారాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలన కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

స్థానికంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు వంటి కీలక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని వెల్లడించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు

నీలోఫర్ ఆసుపత్రి నుంచి ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం

గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మైత్రి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. నీలోఫర్ ఆసుపత్రిలో తలసేమియా పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు ఆసుపత్రి సిఎస్ నాగజ్యోతి, సూపరిండెంట్ విజయ్ కుమార్‌లు ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్‌కు ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తమ సేవలకు లభించిన గౌరవమని, మాపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

లిప్పన్ కళారూపానికి ఆధునికతగీతంలో నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకార వేడుక

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం నెక్సెస్ 2025 పేరిట సృజనాత్మకత, సంస్కృతి, సహకారం యొక్క ఉత్సాహభరితమైన వేడుకను నిర్వహించి, లిప్పన్ కళ యొక్క కాలాతీత ఆకర్షణను సమకాలీన వెలుగులోకి తీసుకొచ్చింది. శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక లెన్స్ ద్వారా తిరిగి ఊహించుకుంటూ, సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలీన డిజైన్ సున్నితత్వాలతో మిళితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది కళాశాలలకు చెందిన 55 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ఒకరికి మరొకరు సహకరించుకోవడంతో పాటు ఇతరులతో పరిచయాలను పెంచుకుని, తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సాంప్రదాయ చేతిపనుల యొక్క సాధారణ అన్వేషణగా ప్రారంభమై, ఆవిష్కరణ, బృంద కృషి, కళాత్మక వ్యక్తీకరణలతో కూడిన కాన్వాస్ గా పరిణామం చెందింది. స్కెచ్ బుక్ లు సంక్లిష్టమైన నమూనాలతో రోజంతా వికసించాయి. నైపుణ్యం కలిగిన చేతుల కింద గాలికి ఎండిపోయిన బంకమట్టి రూపాంతరం చెంది, చేతిపనులను ప్రతిబింబించాయి. వర్ధమాన వాస్తుశిల్పులు శతాబ్దాల నాటి లిప్పన్ కళారూపాన్ని ఆధునిక మెరుగులద్దారు. నెక్సెస్ లో పాల్గొన్న వారంతా తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, నేటి నిర్మాణ, కళాత్మక వ్యక్తీకరణలలో సాంప్రదాయ మూలాంశాలు తాజా అర్థాన్ని ఎలా పొందవచ్చో అన్వేషించడంతో వాతావరణమంతా శక్తి, ఊహతో సజీవంగా మారింది. తత్ఫలితంగా, భారతదేశ కళాత్మక వారసత్వాన్ని, యువత ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబించే సృజనాత్మక ప్రదర్శనగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షా నోముల (యూనిట్ సెక్రటరీ, మూడో సంవత్సరం), జక్కిడి అద్వయ స్ఫూర్తి (యూనిట్ డిజైనర్, రెండో సంవత్సరం)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రుతి గావ్లి సమన్వయం చేశారు.

నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ 

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన గోనె ఉమారాణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉమారాణి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీఎంఆర్ ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ఓసి లతోపాటు సీఎంఆర్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు కుమార్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి పాల్గొన్నారు.

జిన్నారంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేశభక్తి, ఆచార సాంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను కాపాడుకోవడమే ర్యాలీ ఉద్దేశమని సూచించారు. దాదాపు 200 మంది సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, ఆర్ఎస్ఎస్ సభ్యులు యువకులు పాల్గొన్నారు.

జిన్నారంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ

  • ఉత్సాహంగా పాల్గొన్న సంఘ్ సభ్యులు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దేశభక్తి, ఆచార సాంప్రదాయాలతో పాటు సనాతన ధర్మాలను కాపాడుకోవడమే ర్యాలీ ఉద్దేశమని సూచించారు. దాదాపు 200 మంది సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, ఆర్ఎస్ఎస్ సభ్యులు యువకులు పాల్గొన్నారు.

ఉత్తమ అవార్డు అందుకున్న మహిళా యాంకర్‌కు సన్మానం

గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన చంద్రిక యుగంధర్ ప్రముఖ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్ (యాంకర్)గా విశిష్టమైన సేవలు అందించి, హైదరాబాద్‌లోని త్యాగరాయ జ్ఞానసభలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని విశిష్ట ప్రతిభా పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి చెందిన మైత్రి ఫౌండేషన్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ శాలువా కప్పి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని గుమ్మడిదల పేరు మరింత ప్రతిష్ఠ పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నవీన్ సాగర్,మణికంఠ,ఉదయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

అమీన్పూర్ మండలం పటేల్ గూడలో కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాయర్ బోర్డ్ ఆధ్వర్యంలో మహిళా ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాయర్ బోర్డ్ మేనేజర్ టన్సీబ్, ప్రోగ్రాం మేనేజర్ ప్రసాద్, ట్రైనర్ మీనా, ఏపిఎం రవిశంకర్ మరియు పటేల్ గూడ మహిళలు పాల్గొన్నారు.

జగిత్యాల లో గుట్కా అక్రమ నిల్వ ,సరఫరా పై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం

ఒకరి అరెస్ట్ , 65,000/- నిషేదిత గుట్కా స్వాధీనం …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో గుట్కా పై ప్రత్యేక నిఘా, దాడులు …

వివరాలు వెల్లడించిన సీసీఎస్ సిఐ కిరణ్ …

రూరల్ మండలంలోని సంగంపల్లి,తిప్పన్నపేట కేంద్రంగా గుట్కా నిల్వ చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకు , షాపులకు అక్రమంగా సరఫరా చేస్తున్న *పల్లెర్ల జలేందర్* అనే వ్యక్తిని పట్టుకొని ,అతని వద్ద నుండి 65,000/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు …

ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా గుట్కా అక్రమ నిల్వ ,రవాణా ,సరఫరా మరియు అమ్మకాలపై పూర్తిగా నిఘా ఉంచడం జరిగిందని , గుట్కా వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించడం జరిగిందని త్వరలోనే వారిపై దాడులు చేసి ,గుట్కా అరికట్టడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు …

ఈ కార్యక్రమంలో సీసీఎస్ సిఐ కిరణ్,ఎస్సై రవీందర్ ,హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు …